మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు జన్మదినాన్ని పురస్కరించుకుని టిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి ఎన్.ఎన్ రాజు, యువజన విభాగం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోరం కనకయ్య ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత పెద్ద ఎత్తున ప్రభుత్వ విప్,రేగా కాంతారావు పై ఉన్న అభిమానంతో రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం అన్నారు. నియోజకవర్గానికి ఆయన చేసిన అభివృద్ధి ని చూసి యువత మనస్ఫూర్తిగా ముందుగా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో యువకులు, విద్యార్థులు,అధిక పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కోరం కనకయ్య ను నియోజకవర్గ,మండల ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు, యువజన నాయకులు, టిఆరేస్వి నాయకులు,మహిళ కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.అనంతరం అభిమానులు,యువజన నాయకులు మాట్లాడుతూ,మా నియోజకవర్గ ప్రజల ఆశాజ్యోతి,విప్ రేగా కాంతారావు పుట్టిన రోజున రక్తదానం చేయడం సంతోషాన్ని ఇచ్చిందని అభిమానం వ్యక్తపరిచారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోరం కనకయ్య, టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు,ముఖ్య నాయకులు,యువజన నాయకులు,విద్యార్థి విభాగం నాయకులు,అభిమానులు,పార్టీ అనుబంధ సంఘాల నాయకులు,మహిళ అధ్యక్షురాలు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: