దమ్మపేట ఏప్రిల్ 14 ( మన్యం మనుగడ ) : ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా కొత్తగూడెం లోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ తరఫున పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించి విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక రంగాల్లో రిజర్వేషన్ కల్పించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రెడ్డి మల్ల వెంకటేశ్వర రావు కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్ గౌడ్ మలాపురం సత్యనారాయణ యోగ టీచర్ రాణి బిసి సంఘ నాయకులు పాల్గొన్నారు అనంతరం అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ కొత్తగూడెం శాసన సభ్యులు వనమా వెంకటేశ్వరరావు లతో కలిసి సభలో ప్రసంగించడం జరిగింది .
Post A Comment: