మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పట్టణంలో దొంతికుంట, పేటమాలపల్లి లో ఏర్పాటు చేసిన డా,, బి ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు. దొంతికుంట మరియు పేటమాలపల్లి లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం పేటమాలపల్లిలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతు అంబేద్కర్ మన దేశంలో జన్మించడం భారత దేశం చేసుకున్న అదృష్ఠం అని, ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన బడుగు బలహీన వర్గాల హక్కులకు భంగం కలగకుండా రాజ్యాంగాన్ని రూపొందించారని అణగారిన వర్గాల అభివృద్ధి కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశారని, ఆయన జీవితం మనందరికీ ఆదర్శమని, అంబేద్కర్ స్ఫూర్తితోనే కేసీఆర్ దలితబందు పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి చెన్నంశెట్టి వరలక్ష్మి, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జూపల్లి రమేష్, సీనియర్ నాయకులు మందపాటి రాజమోహన్రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, సర్పంచ్లు, ఎంపిటిసిలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: