CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి.

Share it:

 


మన్యం,మనుగడ మంగపేట.

 మంగపేట మండలం రాజుపేట గ్రామంలో అంబేద్కర్ 131 వ జయంతి సందర్భంగా బిజెపి మండలం నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి, కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండలం అద్యక్షులు వీరన్ కుమార్ మార్ మాట్లాడుతూ అంబేద్కర్ భారత దేశానికి ఆదర్శంగా నిలిచారని మరియు తన మేధాశక్తితో భారత రాజ్యాంగాన్ని తొలుత అన్ని సామాజిక వర్గాలకు సమాన హక్కులు ఉండే విధంగా రాయడం జరిగిందని అన్నారు.మంగపేట మండలం ఉపాధ్యక్షులు పల్నాటి సతీష్ మాట్లాడుతూ అంబేద్కర్ అంటే ఏ ఒక్క కులానికో, మతానికో చెందినవారు కాదని అంబేద్కర్ అంటే భారత దేశానికి ప్రాతినిధ్యం వహించిన అపర మేధావి, భారత దేశానికి రాజ్యంగ పిత, రాజ్యాంగం రాసి దేశానికి దిశా నిర్దేశం చేసిన నాయకుడు, అంబేద్కర్ అంటే భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, అంబేద్కర్ అంటేనే విద్యావేత్త, న్యాయ శాస్త్ర కోవిధుడు,నా భారత దేశ ప్రజలకు నేను ఇవ్వలేదు ఓటు అనే బ్రహ్మ అస్త్రం నా ప్రజల చేతికి అందిస్తున్నాను దానిని సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా ఎదగాలి ప్రభోదించారు, చదువు ద్వారా మనం అనుకున్నది సాధించవచ్చు అని తెలియజేసిన బహుముఖ ప్రజ్ఞ శాలి, భారతదేశ ప్రజలకు ఆరాధ్య దైవం అటువంటి మహానుభావులు అంబేద్కర్ జయంతి మనం జరుపుకోవటం మన అదృష్టం అని తెలియజేశారు. అకినేపల్లి మల్లారం లో పిచుకల విజయ్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూల మాల వేసినారు. ఈ కార్యక్రమంలో, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి వేణు, ప్రధాన కార్యదర్శి రావుల జానకిరామ్, ఓబీసీ మండల అధ్యక్షుడు ఇందారపు ప్రతాప్, మండల మహిళా అధ్యక్షురాలు గోమాసు సావిత్రి, మండల మహిళా ప్రధాన కార్యదర్శి స్వర్ణలత, వాగొడ్డు గూడెం బూత్ అధ్యక్షుడు గట్టుపల్లి నాని, నిమ్మ గూడెం బూత్ ప్రధాన కార్యదర్శి కొమరం శ్రావణ్ కుమార్ ,తొండపు శ్రీనివాస్ రెడ్డి, గాదె నరేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు వల్లె పెళ్లి బాల మురళి, బట్ట రాములు, సల్లూరి రాజేందర్, బట్ట దామోదర్, నవీన్,ముకుందo,మహేష్,సాంబయ్య,సంపత్,నరసింహారావు, పగిడి, ప్రకాష్, ప్రతాప్, శేఖర్, మహేష్, విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: