గురువారం మండల పరిధిలోని దంతేలబోరా ఎస్సీ కాలనీ గ్రామపంచాయతీ లో అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత, సర్పంచ్ గద్దల రమేష్
131 వ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్వంచ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కన్నెగంటి వెంకటేశ్వర్లు మరియు అంబేద్కర్ జాతీయ ఫెలోషిప్ అవార్డు గ్రహీత సిద్దుల రవి మాట్లాడుతూ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికి సొంతం కాదు. ఆయన అందరివాడు అంటరానితనం కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు ప్రపంచంలోని గొప్ప రాజ్యాంగాన్ని రచించి ప్రజల అవసరాలు హక్కులను తెలిపాడు ఆ మహోన్నత వ్యక్తి జయంతి రోజున ఆయనను మరోసారి స్మరించుకుందాం అని అన్నారు
అలాగే
సర్పంచ్ గద్దల రమేష్ మాట్లాడుతూ
బాబా సాహెబ్ గా ప్రసిద్ధి పొందిన భారతరత్న డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ అణగారిన వర్గాల ఆర్థిక సామాజిక సాధికారికత కోసం తన జీవితం చివరి వరకూ పోరాటం చేశారు రాజ్యాంగ రచన చేయడం ఆయన జీవితంలో ప్రముఖ ఘటం ఆయన ఒక న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘసంస్కర్త, అని ఆయన కొనియాడారు
ఈ కార్యక్రమంలో విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ జినుగు నాగరాజు వార్డు సభ్యులు శ్రీలత, వెంకట నరసమ్మ, లక్ష్మి, మరియు ఆశ వర్కర్ సుజాత పంచాయితీ సిబ్బంది పూర్ణ, భాస్కర్, ప్రణీత్ వెంకటేష్ బాబులు,
గ్రామ పెద్దలు రామారావు పేరమయ్య, శ్రీను మరియు గ్రామస్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు
Post A Comment: