కుల రహిత సమాజం కోసం, సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా, బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పోరాడాలని, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఆవునూరి మధు పిలుపునిచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 131 జయంతి సందర్భంగా గురువారం న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో పాల్వంచ లోని అంబేద్కర్ సెంటర్ లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.. అంటరానితనం, కులనిర్ములన కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎంతో కృషిచేశారనీ, అసమానతలు లేని, మానవతా విలువలతో కూడిన భారతదేశాన్ని కాంక్షించి, బ్రతికి ఉన్నంత వరకూ అనేక కష్టాలను భరిస్తూ, అణగారిన పేద వర్గాల అభ్యున్నతి కోసం, ఆధిపత్య భావనకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు మోరా రవి, గౌని నాగేష్ , కందగట్ల సురేందర్, జక్కుల రాంబాబు, వైఎస్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి , వీరస్వామి , బద్రు ఉమా , సురేష్, నరసింహారావు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: