గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని ఐ.ఎఫ్.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఐ.ఎఫ్.టి.యు కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో పనిచేస్తూ, నిత్యం పల్లెలను శుభ్రంగా చేసే గ్రామపంచాయతీ కార్మికులకు ఫిబ్రవరి నెల నుండి వేతనాలు చెల్లించక పోవడం దారుణమన్నారు. వేతనాలు ఇవ్వకపోవడంతో వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి అన్నారు. జిల్లాలో 481 గ్రామపంచాయతీ లలో 16 వందల పైచిలుకు కార్మికుల పనిచేస్తున్నారని, వీరంతా గ్రామ పంచాయతీలలో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగింపు, డ్రైనేజీ ల నిర్వహణ, హరితహారం మొక్కలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద పరిశుభ్రత, ట్రాక్టర్, ట్రాలీ ఆటో ల ద్వారా చెత్త సేకరణ, విద్యుత్ దీపాలు, తాగునీటి సరఫరా నిర్వహణ తదితర విభాగాల్లో పని చేస్తున్నారని అన్నా రు. వీరికి తక్కువ వేతనాలు చెల్లిస్తూ వెట్టిచాకిరీ చేయించుకోవడమే కాకుండా ప్రతినెలా వేతనాలు కూడా సరిగా చెల్లించక పోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మరియు అధికారులు వెంటనే స్పందించి వారి యొక్క వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతనాలు చెల్లించకపోతే తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామన్నారు. గ్రామపంచాయతీ కార్మికులంతా ఆందోళనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశం లో ఐ.ఎఫ్.టి.యు మణుగూరు ఏరియా నాయకులు ఎండీ. గౌస్, యాకయ్య, కే. తిరుపతి, ఎం. రాములు, రామయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: