గుండాల/ఆళ్ల పల్లి ఏప్రిల్ 14(మన్యం మనుగడ) భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలను మండలంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి ఎంపీపీ మంజుభార్గవి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం జడ్పిటిసి హనుమంతరావు, ఎంపీపీ మంజుభార్గవి భూమి పూజ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏర్పాటు చేసుకునేందుకు భూమి పూజ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమాలలో ఎంపీడీవో మంగమ్మ, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయ నరసింహారావు, అధికారులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు

Post A Comment: