గుండాల ఏప్రిల్ 12(మన్యం మనుగడ) కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పెట్రోల్ బంక్ నందు ధర్నా నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కోడేం ముత్యమా చారి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తుంది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బస్, విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపై భారాన్ని మోపింది అన్నారు. తక్షణమే స్పందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ముత్తయ్య , తా ఆళ్లపల్లి మండల అధ్యక్షులు సుబ్బారావు, ఎంపీటీసీ కృష్ణారావు, ఈ సం పాపారావు, సర్పంచ్ జయసుధ శోభన్, కృష్ణ , వాంకుడోత్ రమేష్, కళ్యాణి, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: