మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం లోని రాజుపేట గ్రామ ప్రజల దాహర్తిని తీర్చటం కోసం శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ప్రధాన సభ్యులు బాడిశ నాగ రమేష్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించిన సందర్బంగా రాజుపేట గ్రామ ప్రజలు, రాజకీయ నాయకులు, గ్రామ యువత, మహిళా సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కొండంత మాటల కన్నా గుప్పెడంత సహాయం మిన్న, ప్రార్ధించే పెదవులకన్నా సహాయం చేసే చేతులు మిన్న, ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ అభినందనీయులు, చేసే సహాయం ఎంత చిన్నదైనా ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది అందుకని ఇటువంటి మంచి కార్యక్రమం స్ఫూర్తి గా తీసుకొని దాతలు ముందుకు రావాలని మన గ్రామ అభివృద్ధి కోసం నడుం బిగించాలని, ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకురాలు కొమరం ధనలక్ష్మి కోరారు.శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మండలం వ్యాప్తంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారని ఇంకా మరెన్నో మంచి పనులు గ్రామానికి చేయాలని ఈసందర్బంగా గ్రామ మహిళలు ఎఱ్ఱం సుమతి, మోర్తల లక్ష్మి, భువనం ధన లక్ష్మి, బొప్పెన జ్యోతి, గరికపాటి లక్ష్మి పతదితరులు కోరారు.
Post A Comment: