మన్యం మనుగడ ఏటూరు నాగారం
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారు ఈ నెల 7వ తారీకు నాడు పిల్లలపై శారీరక మానసిక లైంగిక వేధింపులు పిల్లల రక్షణ పోషణ సంబంధిత సమస్యలు వివిధ రకాల బాలల హక్కుల ఉల్లంఘనలు వంటి ఎన్నో రకాల సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించడానికి ఏడో తారీఖున ప్రాజెక్ట్ అధికారి ఏటూరు నాగారం కార్యాలయం
లో "బాల-అదాలత్ '' నిర్వహించబోతున్నారని జిల్లా సంక్షేమ అధికారిణి శ్రీమతి ప్రేమలత మీడియా ద్వారా తెలిపారు.ఈ బాల అదాలత్ కార్యక్రమంలో ఫిర్యాదులను స్వీకరించేందుకు ఐటీడీఏ వద్ద మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మండలాల వారీగా ఫిర్యాదుల స్వీకరణ శిబిరాలు యూ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని నేరుగా కమిషన్ కి ఫిర్యాదులు అందజేయాలని అనుకునేవారు ఈ నెల ఏడో తారీఖు ఏటూరు నాగారం ఐటిడిఏ కార్యాల యంలో ఉదయం10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే బాల అదాలత్ నకు వచ్చీ తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ వారికి స్వయంగా అంద చేయవచ్చు నాని.ములుగు జిల్లా లోని ప్రజలు,పౌరులు,ప్రజా ప్రతినిధులు,స్వచ్ఛంద సంస్థలు,ప్రతినిధులు బాలల హక్కుల కొరకు పనిచేసే వాలంటీర్లు బాల అదాలత్ నందు నేరుగా పాల్గొని బాలల సమస్యలపై స్పందించి తగిన పరిష్కారం పొందుటకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారిణి శ్రీమతి ప్రేమ లత పిలుపునిచ్చారు.
Post A Comment: