CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గిరిజనులకు పోడు భూముల హక్కు పత్రాలు ఇప్పించాలి.కేంద్రం దృష్టి కి పోడు సమస్య తీసుకవెళ్లండి.

Share it:

 



  • గవర్నర్ తమిళసై కి వినతిపత్రం అందజేసిన జెడ్.పి.టి.సిసున్నం నాగమణి

మన్యం మనుగడ, ములకలపల్లి: పోడు సాగు చేసుకుంటున్న పోడు భూములకు తక్షణమే పట్టాలు విధించాలని ములకలపల్లి జెడ్ పి టి సి సున్నం నాగమణి దమ్మపేట మండలం పర్యటనకు విచ్చేసిన గవర్నర్ తమిళసై కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ

గిరిజన పోడు భూముల హక్కు పత్రాల కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో 08 నవంబర్ - 2021 న తెలంగాణా రాష్ట్ర గవర్నమెంటు దరఖాస్తులు స్వీకరించటం జరిగినది. ఇట్టి విధంగా సుమారు 1,01,340. మంది రైతులు ఎ॥ 3,37,451.33 (అక్షరాలా మూడు లక్షల ముప్పై ఏడు వేల నాలుగు వందల యాభై ఒకటి మంది దరఖాస్తు చేసుకునియున్నారు. ఇందులో సుమారు 74,063 మంది గిరిజన రైతులు ఎ॥ 2,59,054.1 మరియు 27,277 మంది గిరిజనేతర రైతులు 78,397.23 ఎకరాలకు దరఖాస్తులు చేసుకునియున్నారు. తరతరాలుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు దారులకు మరియు ఆర్.ఓ.ఎఫ్.ఆర్ 2005 చట్టం ప్రకారం సాగులో ఉన్న భూములను అటవీ శాఖ అధికారులు అమాయక గిరిజనులను భయ భ్రాంతులకు

గురి చేస్తూ కందకాలు త్రవ్వి అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం పట్టించుకోకుండా ఇంత వరకు

పట్టాలివ్వకుండా అమాయక గిరిజన రైతులను ఇబ్బందిపెట్టడం అత్యంత శోచనీయం. ఒక వైపు ప్రభుత్వం వారు పట్టించుకోకపోవడం మరియు తర తరాల నుంచి సాగు చేసుకుంటున్న భూములలోకి రావద్దని అంటున్న

ఫారెస్టు వారి ఆగడాలను భరించలేక, కేవలం వ్యవసాయమే జీవనాధారంగా బ్రతుకుతున్న గిరిజనులు అన్యాయం. అయిపోతున్నారు. కావున తమరు మా యం దయ వుంది. ప్రభుత్వం వారు త్వరగా పెట్టాలిచ్చేలాగున తగు చర్యలు 

తీసుకుని, ఫారెస్టు అధికారులు ఇబ్బంది పెట్టకుండా చూడాలని ఆమె గవర్నర్ ని వేడుకున్నారు.

Share it:

TS

Post A Comment: