మన్యం టివి దుమ్ముగూడెం:: ప్రగళ్లపల్లి గ్రామపంచాయతీ బైరాగులపాడు గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కొండా నాగరాజు ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో బాధ పడ్డారు హాస్పటల్ వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ నుండి విడుదలైన 54000 రూపాయల చెక్కును వారి ఇంటికివెళ్లి పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు అందజేశారు . పార్టీ మండల అధ్యక్షులు అన్నే సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వంలో ప్రతి కార్యకర్తకు ,ప్రతి పేదవాడికి అండగా ఉంటుందని అలాగే అనే ప్రతి కార్యకర్త టిఆర్ఎస్ ప్రభుత్వం అందించే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తెలిసేవిధంగా పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జుంజురి లక్ష్మీ, కార్యదర్శి కణితి రాముడు జెడ్ పి టి సి తెల్లం సీతమ్మ, ఎం పి పి రేసు లక్ష్మీ ,పార్టీ ఉపాధ్యక్షులు తునికి కామేష్, ఎం పి టి సి లు మడకం రామారావు, తెల్లం భీమరాజు ,పెదనల్లబల్లి సర్పంచ్ మట్టా వెంకటేశ్వరవు, పార్టీ నాయకులు జుంజురి జయసింహ, జిలకర గంగరాజు యంబడి అర్జునరావు, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: