మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అశ్వాపురం పంచాయితీ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మండల తెరాస పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో చిలక విశ్వనాధ్ 16000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మర్రి మల్ల రెడ్డి,మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు అశోక్ కుమార్,చిలక వెంకటరమయ్య,నియోజకవర్గ యువజన విభాగం ఉపాధ్యక్షులు లాంకెలా రమేష్,నియోజకవర్గ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మంగళగిరి రామకృష్ణ, ఎస్సీ సెల్ కమిటీ అధ్యక్షులు గొర్రెముచ్చు వెంకట్రమణ,సర్పంచ్ పాయం భద్రయ్య,దాసరి దాసు,బలరాం,అశ్వాపురం సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి లోహిత్ యాదవ్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: