మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం లోని మిట్టగూడెం నుంచి కుమ్మరిగూడెం వరకు 8 కిలోమీటర్ల మేర సుమారు 7.5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జరుగుతున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పరిశీలించారు, రోడ్డు నిర్మాణ పనులు పూర్తిచేయాలని తెలియజేశారు, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ రోడ్డు సౌకర్యం కల్పించినందుకు స్థానిక ప్రజలు రేగా కాంతారావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 3 కిలోమీటర్లు ఫారెస్ట్ క్లియరెన్స్ లేకపోవడంతో నిలిచిపోయిన పనులను 1 లేదా 2 రోజులలో ప్రారంభిస్తారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు యువజన నాయకులు అభిమానులు కార్యకర్తలు సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: