ములకలపల్లి:మన్యంమనుగడ ప్రతినిధి:
మండలంలోని తిమ్మంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో వార్షికోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు.పాఠశాల విద్యార్థుల ఆటపాటలతో,సంస్కృతిక కార్యక్రమాలతో కన్నుల పండుగలా జరిగింది.అనంతరం ఎం.ఇ.వో. మాట్లాడుతూ ప్రయివేట్టు పాఠశాలకు ధీటుగా ఈ పాఠశాలను ఇంత చక్కగా గ్రామ ప్రజల సహకారం తో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తుల సహకారం తో పాఠశాల వార్షికోత్సవాన్నీ జరుపుకోవడం చాలా సంతంగా ఉందనితెలిపారు, అనంతరం పాఠశాల అభివృద్ధికి సహకరించిన పెద్దలని,అధికారులని సన్మానించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాలు శంకర్, ముఖ్య అతిథిగా పాఠశాల అభివృద్ధి ప్రదాత జలగం లీలా సంతోష్ కుమార్ దంపతులు, మండల విద్యాశాఖ అధికారి శ్రీరామ్మూర్తి, అన్నామణి,సర్పంచ్ గౌరి లక్ష్మీ ,ఉప సర్పంచ్ తాండ్రఅరుణ,ఎస్ ఎం సి చైర్మన్ సంగంరవి, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు తాండ్ర.ప్రభాకరరావు, వూటుకూరుజోగానందం,గౌరి నాగేశ్వరరావు,పుప్పాల హారినాధ్,శెట్టిపల్లి భాస్కరరావు, జలగం సుభాష్ ,పూర్వ విద్యార్థులు,తిమ్మంపేట యూత్,విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు తదితరులు ఈ కార్యక్రమం లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post A Comment: