మన్యం మనుగడ కరకగూడెం: మండల పరిధిలోని గ్రామ శివారు లోని వాహనాలను కరకగూడెం ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మోతే గ్రామ శివారు లోని వాహనాలను ట్రైని ఎస్ఐ గణేష్ ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ గడ్డం. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గతంలో పెండింగ్లో ఉన్న ఇ - చాలన్లు రాయితీతో ఈ నెల 15 వ తారీకు లోపు పూర్తి చేసుకోవాలని వాహనదారులకు చూపించారు. అలాగే ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ తో పాటు డ్రైవింగ్ లైసెన్స్, బండి కాగితాలు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. వాహనదారులు సరైన ధ్రువీకరణ పత్రాలు చూపించండి ఎడల వారికి ఇ- చాలన్లు తప్పక సారి చెల్లించక తప్పదన్నారు. ద్విచక్ర వాహన దారులు తమ పిల్లలకు వాహనాలు ఇచ్చి రోడ్లపైకి పంపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: