CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పోడు దరఖాస్తులు పరిశీలించి వెంటనే పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి.మాజీ ఎంపీ ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ నాయకులు మిడియం బాబురావు.

Share it:

 


ములకలపల్లి:ఏప్రెల్01:(మన్యం మనుగడ)ప్రతినిధి:

పోడుసమస్యను వెంటనే పరిశీలించి సాగులో ఉన్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని మాజీ ఎంపీ,ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ నాయుడు డాక్టర్ మీడియం బాబురావు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మండల 3వ మహా సభ లో పాల్గొని, ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ,పోడు సాగు దారులపై అటవీ అధికారుల నిర్బంధం తక్షణమే ఆపాలని,పోడు భూముల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు.గిరిజనులపై అటవీ శాఖ అధికారుల దాడులు ఆపాలని,పోడు భూముల్లో ట

కందకాలు తవ్వడం తక్షణమే ఆపివేయ్యాలని డిమాండ్ చేశారు. అటవీ ఉత్పత్తులను సేకరించి జీవించే ఆదివాసులపై కేంద్ర ప్రభుత్వం కేసులు బనాయించి జైలుకి పంపే చట్టాలు తీసుకు వస్తున్నారని వెంటనే ఆచట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ పాలకవర్గాలు పుట్టక మునుపే గిరిజన చట్టాలు వచ్చాయని ,కుట్రలు చేసి ఆదివాసీల ను అడవినుండి వెళ్ళగొట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నాగం పన్నుతున్నాయని , గిరిజనులను పోడు భూముల నుండి వెడలగొట్టి కార్పొరేట్లకు అటవీ భూములను అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తునికాకు సేకరణ చేపట్టాలని ,పెండింగ్ లో ఉన్న తునికాకు బోనస్ ను వెంటనే విడుదల చేయాలనిడిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా అద్యక్షులు వజ్జా సురేష్,సున్నం గంగ,

మండలకార్యదర్శి గౌరి నాగేశ్వరరావు,పోడియం వెంకటేశ్వర్లు,రాంమూర్తి,ఆదినారాయణ, వెంకట్రావు, పాపమ్మ ,శ్రీ ను, క్రృష్ణ.తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: