CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆదివాసి సింహ గర్జన కార్యక్రమానికి విప్ రేగా కు ఆహ్వానంఆదివాసి అఖిలపక్ష సంఘాల నాయకులు.

Share it:



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావును జాతీయ ఆదివాసి అఖిలపక్ష సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం నాడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,జూన్ 5,6 తేదీ లలో 5 రాష్ట్రాల ఆదివాసీలతో భద్రాచలం వేదికగా జరగనున్న ఆదివాసి సింహ గర్జన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ, ఆదివాసి అఖిలపక్ష సంఘాల నాయకులు విప్ రేగా కాంతారావు ఆహ్వానాన్ని అందజేశారు.తప్పకుండా హాజరు అవుతానని విప్ రేగా వారికి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి అఖిలపక్ష సంఘాల నాయకులు,టిఆర్ఎస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: