గుండాల/ఆళ్లపల్లి ఏప్రిల్ 6(మన్యం మనుగడ) అభివృద్ధికి దిక్సూచిగా పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు నిలుస్తున్నారని ఆళ్లపల్లి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహా రావు అన్నారు. బుధవారం రేగా ఆదేశాలతో మర్కోడు పంచాయతీలోని వివిధ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విప్ రేగా కాంతారావు మండలంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ అభివృద్ధికి బాటలు వేస్తున్నారని అన్నారు. రేగా కాంతారావు నాయకత్వంలో మండలం మరింత అభివృద్ధి చెందటం ఏమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్ పి టి సి హనుమంతరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు
Post A Comment: