గుండాల ఏప్రిల్9 (మన్యం మనుగడ) మండలం పరిధిలోని సజ్జల బోడు గ్రామానికి చెందిన జోగ నాగేశ్వరరావుకు గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యాడు అతను చికిత్సకు ఖర్చు పెద్ద మొత్తంలో అయిన నేపథ్యంలో ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కృషితో సీఎం సహాయనిధి నుండి 46 వేల రూపాయలు మంజూరయ్యాయి. ఆ చెక్కులు శనివారం పార్టీ మండల అధ్యక్షులు తేల్లం భాస్కర్, పార్టీ సీనియర్ నాయకులు మోకాళ్ళ వీరస్వామి బాధితునికి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మండలంలో పెద్ద మొత్తంలో సీఎం సహాయనిధి నుండి నిధులు మంజూరు చేయిస్తున్న రేగా కు ధన్యవాదాలు అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సమ్మయ్య , మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగయ్య , యువజన విభాగం అధ్యక్షులు సయ్యద్ అజ్జు, బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం రమేష్, పార్టీ నాయకులు పొంబోయిన సుధాకర్, లక్ష్మి నారాయణ, కిరణ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: