మన్యం మనుగడ ఏటూరు నాగారం
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం, ఊరట్టం,కన్నెపల్లి,కొత్తూరు, రెడ్డిగూడెం,ఎర్రగడ్డ,బాస గూ డెం,గ్రామాలలో రైతులకు పశువు పరిశోధన స్థానం వరంగల్ కు చెందిన శాస్త్రవేత్తలు డాక్టర్ అమరేశ్వరి డాక్టర్ హనుమంతరావు లు జిల్లా పశువైద్యాధికారి విజయభాస్కర్ ఆధ్వర్యంలో 150 మంది రైతులకు ఎస్టీ సబ్ ప్లాన్ నుండి ప్రతి ఒక్కరికి 12 చొప్పున ఉచితంగా రాజశ్రీ కోడి పిల్లలను పంపిణీ చేశారు. డాక్టర్ అమరేశ్వరి డాక్టర్ హనుమంతరావు లు మాట్లాడుతూ.కోళ్లు పెంచుకొని ఆర్థికంగా లాభపడాలని, మూడు సంవత్సరాల వరకు ఈ గ్రామాల రైతులకు సేవ చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి నరసింహ, మేడారం సర్పంచ్ బాబురావు, ఊరట్టం సర్పంచ్ శ్రీధర్, రైతులు చర్ప రవీందర్, సిద్దబోయిన సురేందర్,జీవన్ రావు,నిశాంత్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: