మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎంపీపీ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. జ్యోతిరావు పూలే నిమ్న కులాలను విద్యావంతులను చేయడానికి ఎంతగానో శ్రమించారని, స్త్రీలు విద్యను అభ్యసించే విధంగా కృషి చేశారని మండల ఎంపిపి గుమ్మడి గాంధీ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలోఎంపిడిఓ కార్యాలయ సిబ్బంది మోహన్ రెడ్డి, కృష్ణార్జున్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: