మన్యం మనుగడ, మంగపేట.
భారత సంఘ సంస్కర్త సామాజిక తత్వవేత్త ఉద్యమకారుడు సంఘసేవకుడు జ్యోతిరావ్ గోవిందా పూలే 192 వ జయంతిf పురస్కరించుకుని బుచ్చంపేట గ్రామ పంచాయితీ కార్యాలయం లో ఎడ్ల నరేష్ ఆధ్వర్యంలో జరిగినది. ఇట్టి సమావేశమునకు ముఖ్యఅతిథిగా మాజీ ఆత్మ చైర్మన్ పగిడిపల్లి వెంకటేశ్వర్లు బుచ్చంపేట మాజీ సర్పంచ్ హాజరై ప్రసంగించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికై పాటుబడిన దీన, జన బాంధవుడు మహిళా విద్య అభివృద్ధికై మొట్టమొదటిసారిగా పాఠశాలలను నెలకొల్పి జాతిని బట్టి పీడిస్తున్న సామాజిక రుగ్మతలను హిందూ వాద బ్రాహ్మణీయ భావజాలాన్ని పట్టి పీడిస్తున్న చీకటిని దాస్య శృంఖలాలు చెందించిన మహానుభావులు అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బుచ్చoపేట గ్రామ పంచాయితీ కార్యదర్శి గురుమూర్తి,గ్రామ కారోబార్ లక్ష్మణ్, గ్రామ అంబేద్కర్ సంఘ నాయకులు నాగేల్లి పరుశరాములు,వెలిశాల సమ్మయ్య, పత్తి సురేష్,ఎడ్ల నాగయ్య తక్కెళ్లపల్లి రవీందర్ రావు,జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: