CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నాయకపోడు సేవ సంఘం అద్వర్యంలో ఘనంగా అంబెద్కర్ జయంతి వేడుకలు.

Share it:

 


మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, వేదాంతపురం గ్రామంలో సర్పంచ్ సోమిని శివ శంకర్ ప్రసాద్ అధ్యక్షతన నాయకపోడు సేవాసంఘం మండల సమక్షంలో డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి పాల్గొన్న అశ్వారావుపేట మండల నాయకపోడు సేవాసంఘం మండల అధ్యక్షులు నారం సీతా రామ్ సింగ్ అంబెద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకపోడు సేవ సంఘం మండల అధ్యక్షుడు నారం సీతారాం సింగ్ డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ను ‘విశ్వ మానవుడి’గా అభివర్ణించారు. పీడిత ప్రజలు తమ సమస్యలు లేవనెత్తేందుకు, హక్కులను సాధించుకునేందుకు అంబేద్కర్‌ వారికి గొంతుక నిచ్చాడని పేర్కొన్నారు. ఎంతో దూరదృష్టితో, మేధో సంపత్తితో అంబేద్కర్‌ పేదలు, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేశారని ఉపాధ్యక్షుడు సంగం కృష్ణ మూర్తి అన్నారు. వారి సంక్షేమానికి తొలి ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి దాది చంటి, రైతు విభాగ అధ్యక్షులు గెడ్డం వెంకటేశ్వరావు, కోశాధికారి గెడ్డం సత్తిబాబు, గ్రామ పెద్దలు పూజరి పోతురాజు, గెడ్డం రాఘవలు, సోమిని ధర్మయ్య, సిద్దిన శ్రీనివాసు, యువకులు దాది సోమరాజు, గెడ్డం రామకృష్ణ, వాసం అభి, గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: