- మత్తుకు బానిసై జీవితాలు చిత్తు చేసుకుంటున్న యువత
- మన్యం మనుగడ వద్ద ఆధారాలు
- అధికారుల చేతివాటం?
- జిల్లా ఎస్పీ దృష్టి సారించాలి.
గుండాల ఏప్రిల్ 14(మన్యం మనుగడ) గుండాల మండలంలో గుట్కా, గంజాయి మూలాలున్న పకడ్బంది చర్యలు తీసుకోకపోవడంతో హద్దు అదుపు లేకుండా కొనసాగుతూనే ఉంది. 2 నెలల క్రితం మండలం పరిధిలోని జగ్గు తండ గ్రామ సమీపంలో గంజాయి పంటను గుర్తించిన పోలీస్ ,ఎక్సైజ్ సిబ్బంది నామమాత్రంగా ఆళ్లపల్లి పోలీస్ స్టేషన్ ఎక్స్చేంజ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని పెట్టి చేతులు దులుపుకున్నారు. అంతే తప్ప పకడ్బందీగా చర్యలు తీసుకోకపోవడం వలన నాడు సాగు వెలుగులోకి వస్తే నేడు ఏకంగా కొందరు గుట్కా రాయులు వీటితో పాటు గంజాయిని సైతం అమ్ముతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. అధికారులు ఈ రెండు దంతాలపై నిఘా పెట్టి ఆదిలోనే తుంచి కాకపోతే మునుముందు పెను ప్రమాదం పొంచి ఉంది
Post A Comment: