మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వ్యాప్తంగా టిఆర్ఎస్ శ్రేణులు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేసి, సంతోషంగా మిఠాయిలు పంచుకున్నారు. మండల వ్యాప్తంగా 23 పంచాయతీలలో ప్రతి గ్రామంలో లో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జెండాను టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఎగర వేయడం జరిగింది.
ఏడూళ్ల బయ్యారం, ఎక్స్ రోడ్డు, పినపాక, జానంపేట, అమరారం, సింగిరెడ్డి పల్లి, సీతంపేట, ఉప్పాక, జగ్గారం తదితర ప్రాంతాలలో జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
Post A Comment: