మన్యం మనుగడ ఏటూరు నాగారం
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జున్ రావు అన్నారు.
బుధవారం ఏటూరునాగారం మండలం కేంద్రంలోని ఆకులవారి ఘనపురం లో సిపిఐ మండల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకోవటం జరిగిందని,
భవిష్యత్తు ప్రణాళిక పై చర్చించడం జరిగిందని ఈ సందర్బంగా సిపిఐ ములుగు జిల్లా కార్యదర్శి తోట మల్లిఖా ర్జునరావు మాట్లాడుతూ.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై నిత్యావసర ధరలు పెంచి ప్రజలతో ఆటలు ఆడుతున్నారని అన్నారు.
ఈ మధ్యకాలంలో పెట్రోల్, డీజిల్,గ్యాస్ ధరలు దపా దపాలుగా పెంచి,ప్రజా ప్రభుత్వాలు మేము ప్రజల కోసమే పనిసేస్తున్నామని, చెప్పే మీరు ఇకనైనా పెంచిన ధరలు తగ్గించాలని,డిమాండ్ చేశారు.మీరు ఇచ్చిన మీ మాటలను,నిలుపుకోవాలని అన్నారు.ఈ సమావేశానికి ముందుగా సీనియర్ నాయకులు జెండా ఆవిష్కరించారు.అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు.మండల కార్యదర్శి
ఎండీ నాసర్ ఎనిమిది మందితో కమిటీ మెంబర్స్ ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగిందని అన్నారు. సత్యనారాయణ,చింతకింది రాములు,చింతలపల్లి లక్ష్మయ్య,తూముల నరసింహా రావు,ఎలీదండి కొమరయ్య, దానం బిక్షపతి,ఎద్దు సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: