CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

న్యాయవాదులు సంక్షేమానికి పాటుపడాలి- మణుగూరు ఇంచార్జీ మెజిస్ట్రేట్ సి.సురేష్.

Share it:

 





మన్యం టీవీ మణుగూరు: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు ప్రదమ శ్రేణి జుడీషియల్ కోర్టు బార్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నికైన కమిటీ కార్యవర్గ సభ్యులు అసోసియేషన్ న్యాయవాదుల సంక్షేమానికి, అసొసియేషన్ అభివృద్దికి పాటుపడాలని మణుగూరు ఇంచార్జీ మెజిస్ట్రేట్ సి.సురేష్ అన్నారు.గురువారం నూతన కమిటీ పదవీ బాద్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిదిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ సి.సురేష్, మాట్లాడుతూ,అసోసియేషన్ కమిటీ బార్ అండ్ బెంచ్ మధ్య పరస్పర సమన్వయ అవగాహన సంబందాలను కొనసాగేలాగా కృషి చేయాలని కోరారు.తద్వారా కోర్టుకు వచ్చే కక్షిదారులకు న్యాయం చేకూర్చాలని అన్నారు. అసోసియేషన్ అభివృద్దికి, అసోసియేషన్ అధ్యక్షులు కుర్మా విజయరావు ప్రతిపాదించిన అంశాలను సభ్యులందరూ అమోదించడం హర్షనీయమని అన్నారు. సభ్యుల అభ్యర్ధన మేరకు అసోసియేషన్ ఆర్ధిక వృద్దికి, అసోసియేషన్ సభ్యుల సంక్షేమానికి చట్ట పరిధిలో పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో అసోసియేషన్ అభివృద్దికి నాలుగు అంశాలపై సమావేశం తీర్మాణించింది.అనంతరం నూతన కమిటీ ఏర్పాటు చేసిన బోజన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఏపిపి దుర్గాబాయ్, వైస్-ప్రెసిడెంట్ ఏ.రామ్మోహాన్ రావు,జనరల్ సెక్రటరీ చిర్రా రవికుమార్,ట్రెజరర్ ఇందుపల్లి అశోక్ కుమార్,స్పోర్ట్స్ అండ్ కల్చరల్ బద్దం శ్రీనివాస్ రెడ్డి, మహిళ ప్రతినిది వలసాల శైలజ,జాయింట్ సెక్రటరీ చిర్రా సరస్వతి సభ్యులు సీనియర్ న్యాయవాదులు యస్.వి. రమణా రెడ్డి,బొమ్మా.రామ కోటయ్య,కె.నగేష్ కుమార్, జాడి చొక్కయ్య,దాసరి కవిత, బిక్కసాని శ్రీనివాస్,పద్మావతి, సర్వేశ్వరరావు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: