CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

దద్దరిల్లిన ధర్నా చౌక్.. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని ఎండగట్టిన రేగా కాంతారావు..

Share it:

 



మన్యం మనుగడ న్యూస్ : కొత్తగూడెం, కొత్తగూడెం నియోజకవర్గ రీజనల్ కోఆర్డినేటర్ (సంఘం నాగరాజు) కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కెసిఆర్ పిలుపులో భాగంగా ప్రభుత్వ విప్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ధర్నాచౌక్ లో గురువారం చేపట్టిన మహాధర్నా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాల నినాదాలతో దద్దరిల్లింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రేగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగం పట్ల చూపిస్తున్న వివక్షతను ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే వరకు, తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం చివరి గింజ కొనుగోలు చేసే వరకు టిఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా నిలబడుతుందని తెలిపారు. పెద్దన్న పాత్ర లో ఉన్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాన్ని మానుకోవాలని సూచించారు. తెలంగాణలో ఉన్న ప్రతి రైతు తమ ఇంటి పై నల్ల జెండా కట్టి నిరసన తెలపాలని కోరారు. ఇది ఆరంభం మాత్రమే నని మునుముందు రైతుల పక్షాన ఎలాంటి పోరాటాల కైనా టిఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ఈనెల 11న ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, బానోత్ హరిప్రియ, లావుడ్యా రాములు నాయక్ , కోరం కనకయ్య, కంచర్ల చంద్రశేఖర్, కాపు సీతామహలక్ష్మి, ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, రైతు సమన్వయ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: