CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కరోనా కష్టాల్లో అండగా నేనున్నా అంటున్న రేగా.బాధితులకు అండగా నిలుస్తూ ఆపదలో ఉన్న వారికి ట్రస్టు ద్వారా సేవ.

Share it:

 


  • నిరంతరం ప్రజల మధ్యలోనే అనునిత్యం ప్రజా సేవ

గుండాల ఏప్రిల్ 21(మన్యం మనుగడ) కరోనా కాలమైన కష్టాల్లో ఉన్న నేనున్నా అంటూ బాధితులకు అండగా నిర్వహిస్తున్న పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు. తాను గెలిచిన తర్వాత ప్రజాక్షేత్రంలో ఉంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజా సమస్యలను అనునిత్యం పరిష్కరిస్తూ ప్రజల ఆదరాభిమానాలను ఉంటున్నారు. కరోనా సమయంలో కరోనా బారిన పడిన వారికి నిత్యవసర వస్తువులను అందించి వారికి కొండంత భరోసా ఇచ్చారు. గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో కరోనా బారిన పడిన ప్రతి కుటుంబానికి రేగా విష్ణు ట్రస్ట్ ద్వారా బియ్యంతో పాటు నిత్యవసర వస్తువులను అందించి వారికి అండగా నిలిచారు. ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు ఆర్థికంగా అండగా నిలిచారు. రెండు మండలాల్లోని అనారోగ్యం పాలై లక్షల రూపాయలు వెచ్చించి ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలను సీఎం సహాయనిధి నుండి వారికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయించి బాధలో ఉన్న కుటుంబాలను అండగా నిలిచారు. ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధితో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అనునిత్యం ప్రజలతో మమేకమై నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఒక్క రేగా తోనే సాధ్యం అనే విధంగా అభివృద్ధి చేస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్న రేగా కు ప్రజలు పెద్ద ఎత్తున అండగా నిలుస్తున్నారు.

Share it:

TS

Post A Comment: