మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం అమరవరం పంచాయతీ కొత్తూరు గ్రామం లో వెలసిన రేగా వారి ఇలవేల్పు పిడుగరాజు జాతరలో తెలంగాణ ప్రభుత్వ విప్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు దంపతులు పాల్గొన్నారు. మేళతాళాలతో రేగా కాంతారావు దంపతులను గుడి వద్దకు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా దంపతులు పిడుగరాజు దేవునికి వస్త్రాలు సమర్పించడం జరిగింది. రేగా వంశానికి చెందిన పలువురు ఇలవేల్పు నమస్కారం సమర్పించి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. రేగా కాంతారావు దంపతులు సంతోషంగా గ్రామ జనాలతో కలిసి నాట్యం చేయడం జరిగింది. అనంతరం కొత్తూరు గ్రామానికి చెందిన రేగా సత్యం తో ఆలయానికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, కరకగూడెం మండల ఎంపిపి రేగా కాళిక, టిఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీశ్ రెడ్డి, అమరారం ఎంపీటీసీ కాయం శేఖర్, పిఎసిఎస్ చైర్మన్ రవి వర్మ, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు వాసు బాబు, శ్రీనివాస రెడ్డి, జానంపేట సర్పంచ్ బాడిస మహేష్, ఉపసర్పంచ్ రాయల సత్యనారాయణ, కిష్టాపురం, కొత్తూరు, అమరారం గ్రామానికి చెందిన ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: