దమ్మపేట ఏప్రిల్ 16 ( మన్యం మనుగడ ) : సిపిఐ అనుబంధ ఆల్ ఇండియా తంజీమ్-ఇ-ఇన్సాఫ్ దమ్మపేట రెండవ మండల మహాసభ ఎస్ కే
మైబు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జ్ బాధ్యులు సయ్యద్ సలీం వ్యవసాయ కార్మిక సంఘం వర్కింగ్ కార్యదర్శి యార్లగడ్డ భాస్కరరావు ఎస్ కె గోరి ఎస్ కే దస్తగిరి మాట్లాడుతూ మైనార్టీ ముస్లిమ్స్ వర్గాలను ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గాని ముస్లిమ్స్ గురించి వాళ్ల స్థితిగతుల గురించి ఆలోచన చేయట్లేదని ముస్లిమ్స్ ఏ రాజకీయ పార్టీ.వైపు ఉంటే ఆ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుందని కానీ ముస్లింని ఈ ప్రభుత్వాలు దూరంగా పెడుతున్నాయని వాళ్ళకి కనీస అవసరాలు కూడా గుర్తించలేదని ముస్లిం మైనార్టీలకు కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఆర్థిక కొట్టి సాయంగా ఇవ్వాలని రేషన్ కార్డులు పెన్షన్లు వెంటనే ఇవ్వాలని డబల్ బెడ్రూమ్ ఇల్లు సొంత జాగా ఉంటే ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ముస్లింలు ఏకమై అధికారంలో ఉన్న కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో టిఆర్ఎస్ కళ్లు తెరిపించాలని ముస్లిం మైనార్టీలకు ప్రభుత్వం నుంచి బ్యాంకు రుణాలు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరినారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు పండూరి వీరబాబు మహిళా సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు ఎస్ కెజానీ బేగం తుపాకుల శాంతి రైతు సంఘం మండల అధ్యక్షురాలు వీరలక్ష్మి జన్ బి. బాజీ .జానీ ఉమర్ తదితర ముస్లిం సోదరులు సోదరీమణులు పాల్గొన్నారు
Post A Comment: