మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: తిప్పనపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న కోదండ రామాలయ శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా జరిగింది.శనివారం ఉదయం నుండి హోమగుండం ఏర్పాటు చేసి, వేదపండితులు వి వి ఆర్ కె మూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, మంత్రోత్స నడుమ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. ప్రేమికులు అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎడవల్లి కృష్ణ, బిజెపి జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ, టి జి ఎస్ రాష్ట్ర నాయకులు తాలూరి వెంకటేశ్వరరావు, టిఆర్ఎస్ జిల్లా నాయకులు జారె ఆదినారాయణ, ఎంపీపీ భానోత్ పార్వతి, జడ్పిటిసి కొణకండ్ల వెంకట రెడ్డి, గానుగపాడు సొసైటీ చైర్మన్ చెవుల చందర్రావు, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, సారేపల్లి శేఖర్, మాలోత్ బోజ్య నాయక్, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారా బాబు, మేడ మోహన్ రావు, ఆలయ కమిటీ బాధ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: