మన్యం టివి దుమ్ముగూడెం::
దుమ్ముగూడెం మండలం మారాయిగూడెం గ్రామపంచాయతీ జిన్నగట్ట గ్రామంలో 2 రోజుల క్రితం ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన ఆరుగురు నిరుపేద ఆదివాసి కుటుంబాలను పినపాక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఈరోజు ప్రభుత్వం తరఫున ఐటీడీఏ భద్రాచలం పిలిపించి ఒక్కో కుటుంబానికి 50000 చొప్పున ఐటీడీఏ పీవో గౌతమ్ తో మాట్లాడి ఇప్పించడం జరిగింది. అదేవిధంగా రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ నుండి ఒక కుటుంబానికి 10,000 ఆర్థిక సాయం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నిప్రమాదంలో ఇల్లు కోల్పోయిన నా కుటుంబాలను ఓదార్చి ప్రభుత్వం తరఫున రావాల్సిన సాయం తో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామని తెలియజేసారు. ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు,మారాయి గూడెం సర్పంచ్ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: