మన్యం మనుగడ/ వాజేడు:
ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో వన్యప్రాణుల వేట జోరుగా కొనసాగుతోంది. అడ్డూఅదుపులేకుండా వేటాడి మాంసాన్ని అమ్ముకుంటున్నారు.
అటవీ ప్రాంతంలో జింకల వేటకు సంబంధించిన ఆనవాళ్లు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు వన్యమృగ మును వేటాడిన వ్యక్తులను పారెస్ట అధికారులు చాక చక్యంగా పట్టుకొని కోర్టుకు తరలించిన సంఘటన వాజేడు మండలం చెరుకూరు గ్రామంలో సంఘటన చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే చెరుకూరు గ్రామ పంచాయతీలోని బయ్యారం కాలానికి చెందిన యాలం శ్యామ్, యాలం రాజబాబు, ఇంక మిగతావారు దొరకలేదు వీరంత కలిసి అడవిలో వేట ఉచ్చులు అమర్శి జింకను బలిగొన్నారు. దాన్ని కోసి గ్రామంలో కేజీ 800, రూపాలకు అమ్మినట్లు సమాచారం ఈ విషయం వారినోట వీరినోటా పాడటంతో అదికాస్తా ఫారెస్ట్ అధికారులకు తెలియడంతో విచారణ జరపగా వన్యప్రాణులను వేటాడిన దొంగలు ఇద్దరు దొరికినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఇంకా ఎంత మంది ఈ కేసులో ఉన్నారు అనేది తెలియవలసి ఉంది. పట్టుబడ్డ వారి దగ్గర జింక తల, చర్మం, గొడ్డలి, కత్తులు స్వాదినం చేసుకొని రిమాండ్ నిమిత్తం భద్రాచలం కోర్టుకు తరలించినట్లు ఎఫ్ ఆర్ ఓ చంద్రమౌళి పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
Post A Comment: