CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఎస్సీ కాలనీల అబివృద్దికే సబ్ ప్లాన్ నిదులు... మున్సిపల్ వైస్ చైర్మన్ అరెపల్లి కుమార్.

Share it:

 


మన్యం మనుగడ,మంథిని(వెబ్ డెస్క్):

దళిత సామాజిక వర్గాలు నివసించే ఎస్సీ కాలనీల అబివృద్దికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఈ క్రమంలో సబ్ ప్లాన్ నిధులను కేటాయించిందని మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్ అన్నారు. మంథని మున్సిపల్పరిదిలోని అంబేద్కర్ నగర్, ముత్యాలమ్మగూడెంలో సబ్ ప్లాన్ నిదుల ద్వారా మంజూరైన పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లడుతూ రెండో వార్డులో డ్రైనేజీ, సీసీరోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం రూ.7లక్షల సబ్ ప్లాన్ నిదులు మంజూరీ అయినట్లు ఆయన తెలిపారు. గతంలో సైతం సీసీ రోడ్ల నిర్మాణానికి నిదులు మంజూరీ అయినట్లు ఆయన వివరించారు. ఎస్సీ కాలనీల అభివృద్దిపై ప్రత్యేక దృష్టిసారించి ఎస్సీ సబ్ ప్లాన్ నిదులు మంజూరీ చేయించిన జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కో- ఆప్షన్ సభ్యులు ఎస్కే యాకుబ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాబా, కాంట్రాక్టర్ గోపాల్రావు, నూకలు అరుణ్ తో పాటు నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: