CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అర్హులకు సంక్షేమ పథకాలు మంజూరు చేయాలి :-సిపిఐ జిల్లా నాయకులు రేసు ఎల్లయ్య.

Share it:

 


గుండాల/ ఆళ్ల పల్లి ఏప్రిల్ 12(మన్యం మనుగడ) అర్హులకు సంక్షేమ పథకాలను తక్షణమే మంజూరు చేయాలని సిపిఐ జిల్లా నాయకులు రేసు ఎల్లయ్య డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం తాసిల్దార్ కు వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 57 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ లను అమలు చేయాలని కోరారు. వీరితోపాటు అర్హులైన వికలాంగులకు, ఒంటరి మహిళలకు పెన్షన్ మంజూరు చేయాలన్నారు. సొంత ఇంటి స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడం కోసం ఆరు లక్షల రూపాయలు మంజూరు చేయాలన్నారు. దళితులు అందరికీ పది లక్షల రూపాయల దళిత బందును అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం వచ్చి 8 ఏళ్లు గడుస్తున్నా ఇంకా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆళ్లపల్లి సర్పంచ్ కోటేశ్వరరావు ,సిపిఐ మండల కార్యదర్శి కృష్ణ , తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: