మన్యం మనుగడ, మంగపేట.
ములుగు జిల్లాలో విడుదల చేసిన దళిత బందు ఎన్నిక జాబితా రహస్యంగా నిబంధనలకు విరు ద్ధంగా ఉన్నందున నిరు పేదలకు న్యాయం జరిగే విదంగా గ్రామ గ్రామాన అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం మంగపేట మండలం రాజుపేట ఎస్సి కాలనీకి చెందిన యువత పలువురు జిల్లా కలెక్టర్ కలసి వినతిపత్రాన్ని అందజేశారు.దళిత బందు ఎంపికను ఎమ్మెల్యే యంపీ లకు ఇవ్వడం వల్ల వారి పార్టీ వారికే న్యాయం జరుగుతుందని అసలైన నిరు పేదలకు న్యాయం జరిగే అవకాశం ఉండదని ప్రభుత్వ పథకాలు దళిత బందు కార్పొరేషన్ లోన్సు,డబుల్ బెడ్ రూమ్,పెన్షన్లు ఇతర పథకాలు ఏవైనా మండల స్థాయి అధికారుల పర్యవేక్షణలో గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభ తీర్మానం ద్వార అర్హులను ఎంపిక చేయాలని కోరారు.
Post A Comment: