భక్తులతో కిటకిటలాడిన మద్దుకూరు గ్రామం... మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: మండల పరిధిలోని మద్దుకూరు గ్రామంలో జరిగిన బొడ్రాయి పునర్ ప్రతిష్ట మహోత్సవంలో అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం ఉదయం నుండి బొడ్రాయి పునర్ ప్రతిష్ట, ముత్యాలమ్మ, పోతురాజు, గ్రామ దేవతల ప్రతిష్ట మహోత్సవాలు, ఆంబోతు ను అచ్చు వేసే కార్యక్రమలు వేదపండితులు వి వి ఆర్ కె మూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలో భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు గుంపెన సొసైటీ చైర్మన్ బోయినపల్లి సుధాకర్ రావు, వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, బిజెపి జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు తాళ్లురి వెంకటేశ్వరరావు,టిఆర్ఎస్ యూత్ నాయకుడు శ్రావణ్ కుమార్, టిఆర్ఎస్ నాయకులు దారా బాబు, ఉప్పతల ఏడుకొండలు, సయ్యద్ రసూల్, మేడ మోహన్ రావు, వంకాయలపాటి బాబురావు, మద్దిరాల పిచ్చయ్య, భూపతి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: