మన్యం మనుగడ కరకగూడెం: మండల పరిధిలోని రేగళ్ళ గ్రామపంచాయతీలో గల మర్రిమెదల గ్రామానికి చెందిన కొమరం వెంకన్న అనే పశువుల యజమానికి చెందిన పశువు ఇటీవలకాలంలో విద్యుత్ షాకుకుగురై మృతి చెందడంతో విద్యుత్ శాఖ అధికారులు నష్టం పరిహారం కింద 40 వేల రూపాయలు చెక్కును మండల పరిధిలోని బర్లగూడెం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు,విద్యుత్ శాఖ ఏడి జీవన్ కుమార్ లు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు ఏఈ రామకృష్ణ,సబ్ ఇంజనీర్ వీరారెడ్డి ఎంపీపీ రేగా కాళిక సర్పంచ్ పొలేబోయిన నరసింహారావు, బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం రాంబాబు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య చిరుమళ్ళ సర్పంచ్ పాయం.నరసింహరావు, తాటి గూడెం సర్పంచ్ కొమరం విశ్వనాథం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: