మన్యం మనుగడ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని రేగుళ్ల,అనంతారం,చొప్పాల పద్మపూరం గ్రామలనుండి వివిధ పార్టీలకు చెందిన 30 కుటుంబాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోతూ అభివృద్ధి పథంలో ముందుకు పోతున్న సీఎం కేసీఆర్ నేతృత్వంలో ముందుకు పోతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ప్రజాసంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుండి టిఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి సరైన సమయంలో తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కొల్లేటి భవాని శంకర్,వట్టం.రాంబాబు, ఎంపీపీ రేగా.కాళిక, బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కుమరన్ రాంబాబు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోమయ్య, నాయకులు అత్తె. నాగేశ్వరరావు,నిట్టా ఏడుకొండలు,నిట్టా.ప్రభాకర్ తోలెం సారయ్య, టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు జాడి రామనాథం బుడగం రాము,వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తొలెం నారాయణ, ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు ఆయన రాజబాబు,బత్తిని సీతయ్య,సురెష్,చప్పిడి వెంకటెశ్వర్లు,కొమ్మ. ప్రసాద్, ఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Navigation
Post A Comment: