మన్యం మనుగడ, మణుగూరు
సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా ఓసి 2 లో కాంట్రాక్ట్ కార్మికునిగా పనిచేసి అనారోగ్యానికి గురైన ఎం కుమార్ వైద్యానికి ఓసి 2 రిలే -C కార్మికులు 10,800 రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా సింగరేణి సేవా సమితి సభ్యులు నా సర్ పాషా మాట్లాడుతూ ఆకస్మికంగా అనారోగ్యానికి గురై వైద్యసేవలకు అప్పు చేసి వైద్యం చేయించుకుని అప్పులపాలైన కుమార్ వైద్యానికి ఆర్థిక సహాయం అందజేయడం అభినందనీయమని ఆయన కొనియాడారు కుమార్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు ఇప్పటికే అధికారులు ఆర్థిక సాయం అందజేసి ఉన్నారని ఇతర విభాగాల కార్మికులు సూపర్వైజర్లు కూడా తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు కష్టాల్లో ఉన్న వాడికి ఆర్థిక సహాయం చేస్తే పోయేదేమీ లేదని కష్టాల్లో ఉన్న వారి అప్పులు తప్ప అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కార్మికులు ఐ శంకర్, మహివికెందర్, ఏఎస్ చారి, ఎండీ ఇమాముద్దీన్, పొదెం శ్రీనివాస్, మేకల కేశవస్వామి,సిహెచ్ శ్రీనివాస్, యూనస్,ఈశ్వర్, వెంకటేష్, రామారావు, సింగ్, బంగారి సత్యనారాయణ, B రవీందర్, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..:.
Post A Comment: