CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం :-పిఎసిఎస్ ద్వారా కొనుగోలు :- ఏ గ్రేడ్ రకం 1960 చైర్మన్ రామయ్య.

Share it:

 


గుండాల ఏప్రిల్ 14(మన్యం మనుగడ) తెలంగాణ ప్రభుత్వం యాసంగి వడ్లు రాష్ట్ర ప్రభుత్వమే ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో గుండాల మండల కేంద్రంలోని పిఎసిఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. ఈ కొనుగోలు కేంద్రాన్ని గుండాల ఎంపీపీ ముక్తి సత్యంతో కలిసి పిఎసిఎస్ చైర్మన్ రామయ్య ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్లు ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలు తెరవాలని ఉత్తర్వులిచ్చింది అన్నారు. ఏ గ్రేడ్ రకానికి పంతొమ్మిది వందల అరవై రూపాయలు నిర్ణయించబడింది అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రామక్క, ఎంపీడీవో హజరత్ వాలి, ఏవో దీపిక, గుండాల సర్పంచ్ సీతారాములు, ఎంపీటీసీ సంధాని, ఏ ఈ ఓ లెనిన్, సీఈవో రాంబాబు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భాస్కర్, సుభాని తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: