మన్యం మనుగడ,ములుగు. భారత రాజ్యాంగనిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ 131జన్మదిన వేడుకలు ములుగు కలెక్టరేట్ ఆవరణలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య డా :బీ ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసిన అనంతరం అంబేద్కర్ గురించి మాట్లాడుతూ డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ ప్రపంచం గర్వించదగ్గ విశ్వమానవుడనిఅభివర్ణించారు.భారత రాజ్యాంగం రచన గావించి తాడిత, పీడిత ప్రజలు తమ సమస్యలు లేవనేత్తేందుకు, హక్కులను సాధించేందుకు అంబేద్కర్ వారికి గొంతుక నిచ్చాడని, సామాన్య సగటు మానవుడికి ధైర్యాన్నిచ్చాడని,ప్రజలకు సాంఘిక, రాజకీయ, ఆర్ధిక,స్వేచ్ఛను అన్ని రంగాల్లో పురోగమించటానికి హక్కును, బ్రహ్మ అస్త్రం లాంటి ఓటు హక్కును అందించి ప్రజలకు ఆరాధ్య దైవం అయ్యారు అని అటువంటి మహనీయుడు ఆశయాలు కొనసాగించాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో డిప్యూటీ కలెక్టర్,ఆర్ డి ఓ రమాదేవి, ఎస్సి కార్పొరేషన్ ఈ డి తులా రమాదేవి, మాల మహానాడు రాష్ట్ర సెక్రటరీ చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ అండ్ విజిలెన్స్ కమిటీ మెంబెర్ రాజమల్ల సుకుమార్, మాల మహానాడు ములుగు జిల్లా జీవ వైవిధ్య డైరెక్టర్ కర్రీ శ్యాంబాబు, మాలమహానాడు ములుగు జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ ప్రవీణ్, మాలమహానాడు ములుగు జిల్లా అధికార ప్రతినిధి బోడ శ్రీను, అంబేద్కర్ యువజన సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు ధీగొండ కాంతారావు, మాల మహానాడు మంగపేట మండల అధ్యక్షులు కర్రీ నాగేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: