మన్యం టివి దుమ్ముగూడెం::
బహుజన సమాజ్ పార్టీ దుమ్ముగూడెం మండల కమిటీ ఆధ్వర్యంలో ములకపాడు సెంటర్ నందు ప్రపంచ మేధావి, భారత బహుజనుల ఆశాజ్యోతి, డా.బి ఆర్ అంబేడ్కర్ 131వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్ సరియం బీమారాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భద్రాద్రి జిల్లా ఇంఛార్జి ఇర్ప కామరాజు విచ్చేసి అంబేద్కర్ పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ వారు మాట్లాడుతూ బి సి ,ఎస్ సి ,ఎస్ టి మరియు మైనారిటీల అభ్యున్నతికై రాజ్యాంగంలో కల్పించబడిన హక్కులు మరియు అధికారాలు, ఆశయాల సాధనకు కృషి చేయాలని, రాజ్యాంగాన్ని మార్చాలనే ఉద్దేశ్యం తో ఉన్న నియంత పార్టీల వైఖరిని కేవలం ఓటు ద్వారా నే భూస్థాపీతమ చెయ్యగలమని తెలిపారు.
ఈ కార్యక్రమానికి బహుజన సమాజ్ పార్టీ భద్రాద్రి జిల్లా కార్యదర్శి - వీసంపల్లి నరసింహారావు , భద్రాద్రి నియోజకవర్గ ఉపాధ్యక్షులు చెన్నం నాగరాజు , నియోజక వర్గ మెంబర్ కంచర్ల సింహాద్రి , ఏ వి ఎస్ పి నియోజకవర్గ అధ్యక్షులు సొందే మల్లుదొర ,అంబేద్కర్ గారి అభిమానులు నాగేశ్వర రావు, కిరణ్, లాజరస్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: