CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తేదీ : 11.4.2022 : తెలంగాణ రైతుల ధాన్యం సేక‌ర‌ణ‌ కోసం ఢిల్లీలో రైతు ధర్నా.రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రసంగం ముఖ్యాంశాలు

Share it:

 


  

• తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనకపోవడం సరికాదు

• తెలంగాణ మంత్రులతో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడిన తీరు బాగా లేదు

• కేంద్రమంత్రి గోయల్ తెలంగాణ ప్రజలను అవమానించారు. 

• రైతులతో పెట్టుకొంటే తట్టుకోలేరని ప్రధాని మోడీని హెచ్చరిస్తున్నా

• ఉమ్మడి రాష్ట్రంలో సాగు రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. 

• ఆరు దశాబ్దాల పాటు ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడాం.

• రాష్ట్ర సాధనలో వందలాది మంది యువత బలిదానాలు చేశారు. 

• ఉద్యమాల పోరాట ఫలితంగా 2014లో తెలంగాణ వచ్చింది. 

• రాష్ట్రం వచ్చాక రైతుల కోసం అనేక సంస్కరణలు తెచ్చాం.

• ఆనాడు తెలంగాణలో వెయ్యి ఫీట్ల లోతులో నీళ్లుండేవి.

• దేశంలో ఎక్కడా లేనంతగా 30 లక్షల బోర్లు తెలంగాణలో ఉన్నాయి. 

• మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించాం. 

• తెలంగాణ వచ్చాక, ఆ పరిస్థితిని పూర్తిగా మార్చివేశాం

• కాకతీయుల నాటి చెరువుల్లో పూడికలు తీయించినం

• పెండింగు ప్రాజెక్టులు చాలావరకు పూర్తి చేసుకున్నం

• కాళేశ్వరం లాంటి కొత్త ప్రాజెక్టులను కూడా కట్టుకున్నం

• దీంతో భూగర్భ జలాలు చాలా పెరిగి, పెకి వచ్చాయి. 

• ఇపుడు తెలంగాణలో సాగునీటికి సమస్య లేనేలేదు. 

• ఒకనాడు కరెంటు కూడా కేవలం 5 గంటలే వచ్చేది

• రైతులు కరంటు కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారు

• తెలంగాణ రాష్ట్రం వచ్చాక కరంటు ఉత్పత్తి పెంచుకున్నం

• మోటార్‌, విద్యుత్‌ తీగలు, బోర్ల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. 

• రైతులకు 24గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే

• ఇటు సాగునీరు, అటు కరంటు సమస్య తీరడంతో, పంటలసాగు పెరిగింది

• అన్నీ బాగుండటంతో తెలంగాణలో వరి ధాన్యం పంట బాగా పండుతున్నది

• ఇలాంటి సమయంలోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ధాన్యం కొనడం లేదు

• కేంద్రం తీరుతో తెలంగాణ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు

• కేంద్ర ప్రభుత్వం తీరుతోనే మేం ఆందోళనలకు దిగాల్సి వస్తున్నది

• ఎవరితోనైనా గొడవ పడొచ్చు కానీ.. రైతులతో గొడవ పడవద్దు 

• కేంద్ర ధాన్యం కొనాలని మేం తెలంగాణ నుంచి 2 వేల కి.మీ. వచ్చి దీక్ష చేస్తున్నాం

• ఇంత దూరం వచ్చి ఆందోళన చేయడానికి కారణమెవరు?

• ప్రభుత్వంలో ఎవరూ శాశ్వతంగా ఉండబోరని తెలుసుకోవాలి

• కేంద్ర మంత్రి గోయల్ రైతులపై చేసిన వ్యాఖ్యలు బాధాకరమైనవి

• పీయూష్ గోయ‌ల్ ఉల్టాఫల్టా మాట్లాడుతున్నారు. 

• పీయూష్‌ గోయల్‌ కాదు.. పీయూష్‌ గోల్‌మాల్‌. 

• గోయల్ కు రైతుల‌పై ఏమైనా అవ‌గాహ‌న ఉందా? 

• పీయూష్ గోయ‌ల్ మీరు ఇంత సంస్కార‌హీనంగా ఎలా మాట్లాడారు?

• తెలంగాణ రైతుల‌ను, మంత్రుల‌ను అవ‌హేళ‌న చేస్తారా?

• పీయూష్‌ గోయల్‌ తెలంగాణ అన్నదాతలు నూకలు తినాలని చెప్పారు. 

• మేమేమైనా పీయూష్‌ గోయల్‌ వద్ద అడుక్కోవడానికి వచ్చామా? 

• కేంద్రమంత్రి పీయూష్‌కు ఎందుకు ఇంత అహంకారం?

• దేశంలో భూకంపం సృష్టిస్తాం.. పీయూష్ గోయ‌ల్ ప‌రుగులు తీయాల్సిందే

• హిట్ల‌ర్, నెపోలియ‌న్ వంటి అహంకారులు కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయారు.. 

• స్వ‌రాష్ట్రంలో వ్య‌వ‌సాయాన్ని పండుగ చేశామ‌న్నారు. 

• రైతు ఏడ్చిన రాజ్యం ఏదీ బాగుప‌డ‌లేదు. 

• ధాన్యం సేక‌ర‌ణ‌కు దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉండాల‌ని డిమాండ్ చేస్తున్నాం

• నేషనల్ ఇంటిగ్రేటెడ్ అగ్రిక‌ల్చ‌ర్ పాల‌సీ రూపొందించాలి  

• రైతుల ప‌ట్ల కేంద్ర ప్రభుత్వం మోస‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నది

• అగ్రిక‌ల్చ‌ర్ పాల‌సీ రూపొందించకుంటే మోదీని త‌రిమికొడుతాం 

• మోదీకి ధ‌నం కావాలి లేదా ఓట్లు కావాలి. ధాన్యం వ‌ద్దు.. 

• ఇదే మీ కేంద్ర ప్ర‌భుత్వం కుట్ర, ఇది రైతు వ్యతిరేకం కాదా? 

• రాకేశ్ తికాయ‌త్‌ను కేంద్రం ఎలా అవ‌మానించిందో మ‌న‌మంతా చూశాం

• తికాయ‌త్‌ను దేశ‌ద్రోహి అన్నారు.. ఉగ్ర‌వాది అన్నారు.

• అయినా, రైతుల కోసం అవ‌మానాలు భ‌రిస్తూనే ముందుకు సాగుతున్నారు.

• రైతుల కోసం జాతీయ రైతు ఉద్య‌మ నేత రాకేశ్ తికాయ‌త్‌తో క‌లిసి ప‌నిచేస్తాం

• తెలంగాణ ప్ర‌జానీకం రైతు నాయకుడు తికాయ‌త్ వెంటే ఉంటుంది

• తెలంగాణలో పండించే ధాన్యం కేంద్రమే కొనుగోలు చేయాల్సిందే 

• రైతుల‌ ధాన్యానికి క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర వ‌చ్చే వ‌ర‌కు పోరాటం చేస్తాం

Share it:

TS

Post A Comment: