• తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనకపోవడం సరికాదు
• తెలంగాణ మంత్రులతో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడిన తీరు బాగా లేదు
• కేంద్రమంత్రి గోయల్ తెలంగాణ ప్రజలను అవమానించారు.
• రైతులతో పెట్టుకొంటే తట్టుకోలేరని ప్రధాని మోడీని హెచ్చరిస్తున్నా
• ఉమ్మడి రాష్ట్రంలో సాగు రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.
• ఆరు దశాబ్దాల పాటు ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడాం.
• రాష్ట్ర సాధనలో వందలాది మంది యువత బలిదానాలు చేశారు.
• ఉద్యమాల పోరాట ఫలితంగా 2014లో తెలంగాణ వచ్చింది.
• రాష్ట్రం వచ్చాక రైతుల కోసం అనేక సంస్కరణలు తెచ్చాం.
• ఆనాడు తెలంగాణలో వెయ్యి ఫీట్ల లోతులో నీళ్లుండేవి.
• దేశంలో ఎక్కడా లేనంతగా 30 లక్షల బోర్లు తెలంగాణలో ఉన్నాయి.
• మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించాం.
• తెలంగాణ వచ్చాక, ఆ పరిస్థితిని పూర్తిగా మార్చివేశాం
• కాకతీయుల నాటి చెరువుల్లో పూడికలు తీయించినం
• పెండింగు ప్రాజెక్టులు చాలావరకు పూర్తి చేసుకున్నం
• కాళేశ్వరం లాంటి కొత్త ప్రాజెక్టులను కూడా కట్టుకున్నం
• దీంతో భూగర్భ జలాలు చాలా పెరిగి, పెకి వచ్చాయి.
• ఇపుడు తెలంగాణలో సాగునీటికి సమస్య లేనేలేదు.
• ఒకనాడు కరెంటు కూడా కేవలం 5 గంటలే వచ్చేది
• రైతులు కరంటు కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారు
• తెలంగాణ రాష్ట్రం వచ్చాక కరంటు ఉత్పత్తి పెంచుకున్నం
• మోటార్, విద్యుత్ తీగలు, బోర్ల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం.
• రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే
• ఇటు సాగునీరు, అటు కరంటు సమస్య తీరడంతో, పంటలసాగు పెరిగింది
• అన్నీ బాగుండటంతో తెలంగాణలో వరి ధాన్యం పంట బాగా పండుతున్నది
• ఇలాంటి సమయంలోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ధాన్యం కొనడం లేదు
• కేంద్రం తీరుతో తెలంగాణ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు
• కేంద్ర ప్రభుత్వం తీరుతోనే మేం ఆందోళనలకు దిగాల్సి వస్తున్నది
• ఎవరితోనైనా గొడవ పడొచ్చు కానీ.. రైతులతో గొడవ పడవద్దు
• కేంద్ర ధాన్యం కొనాలని మేం తెలంగాణ నుంచి 2 వేల కి.మీ. వచ్చి దీక్ష చేస్తున్నాం
• ఇంత దూరం వచ్చి ఆందోళన చేయడానికి కారణమెవరు?
• ప్రభుత్వంలో ఎవరూ శాశ్వతంగా ఉండబోరని తెలుసుకోవాలి
• కేంద్ర మంత్రి గోయల్ రైతులపై చేసిన వ్యాఖ్యలు బాధాకరమైనవి
• పీయూష్ గోయల్ ఉల్టాఫల్టా మాట్లాడుతున్నారు.
• పీయూష్ గోయల్ కాదు.. పీయూష్ గోల్మాల్.
• గోయల్ కు రైతులపై ఏమైనా అవగాహన ఉందా?
• పీయూష్ గోయల్ మీరు ఇంత సంస్కారహీనంగా ఎలా మాట్లాడారు?
• తెలంగాణ రైతులను, మంత్రులను అవహేళన చేస్తారా?
• పీయూష్ గోయల్ తెలంగాణ అన్నదాతలు నూకలు తినాలని చెప్పారు.
• మేమేమైనా పీయూష్ గోయల్ వద్ద అడుక్కోవడానికి వచ్చామా?
• కేంద్రమంత్రి పీయూష్కు ఎందుకు ఇంత అహంకారం?
• దేశంలో భూకంపం సృష్టిస్తాం.. పీయూష్ గోయల్ పరుగులు తీయాల్సిందే
• హిట్లర్, నెపోలియన్ వంటి అహంకారులు కాలగర్భంలో కలిసిపోయారు..
• స్వరాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేశామన్నారు.
• రైతు ఏడ్చిన రాజ్యం ఏదీ బాగుపడలేదు.
• ధాన్యం సేకరణకు దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని డిమాండ్ చేస్తున్నాం
• నేషనల్ ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ పాలసీ రూపొందించాలి
• రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తున్నది
• అగ్రికల్చర్ పాలసీ రూపొందించకుంటే మోదీని తరిమికొడుతాం
• మోదీకి ధనం కావాలి లేదా ఓట్లు కావాలి. ధాన్యం వద్దు..
• ఇదే మీ కేంద్ర ప్రభుత్వం కుట్ర, ఇది రైతు వ్యతిరేకం కాదా?
• రాకేశ్ తికాయత్ను కేంద్రం ఎలా అవమానించిందో మనమంతా చూశాం
• తికాయత్ను దేశద్రోహి అన్నారు.. ఉగ్రవాది అన్నారు.
• అయినా, రైతుల కోసం అవమానాలు భరిస్తూనే ముందుకు సాగుతున్నారు.
• రైతుల కోసం జాతీయ రైతు ఉద్యమ నేత రాకేశ్ తికాయత్తో కలిసి పనిచేస్తాం
• తెలంగాణ ప్రజానీకం రైతు నాయకుడు తికాయత్ వెంటే ఉంటుంది
• తెలంగాణలో పండించే ధాన్యం కేంద్రమే కొనుగోలు చేయాల్సిందే
• రైతుల ధాన్యానికి కనీస మద్దతు ధర వచ్చే వరకు పోరాటం చేస్తాం
Post A Comment: