మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండల కేంద్రంలో తెలంగాణ అంబెద్కర్ యువ జన సంఘం మండల ప్రధాన కార్యదర్శి బసారి హరిక్రిష్ణ ఆధ్వర్యంలో మంగళవారం భారత మొట్ట మొదటి ఉప ప్రదాని డా బాబు జగ్జీ వన్ రామ్ 114 వ జయంతి వేడు కలను మండల కేంద్రం లోని అంబెద్కర్ కమ్యూనిటి హల్ ఆవరణలో నిర్వహించారు.ఈ కార్యక్రమం కు ముఖ్య అతిథిగా డిప్యూటి తహశీల్దార్ సురేశ్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రం పటానికి పూల మాల వేసి నివాళులర్పించా రు.డిప్యూటీ తహసీల్దార్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల వారు, బహుజనులు ఇటువంటి మహానీయులను ఆదర్శంగా తీసు కొని ఉన్నత మైన చదువులు చదివి ముందుకు పోవాలని తద్వారా ఉన్నత పదవులు అలంకరించాలి,ఏది కావాలి అన్న విద్య తోనే సాద్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో అంబెద్కర్ యువజన సంఘం సీనియర్ నాయకులు పగిడిపల్లి వెంక టేశ్వర్లు,చిట్టిమల్ల సమ్మయ్య, అంబెద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి దిగొండ కాంతారావు,ఎజెన్సీ దళిత సేవ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసి డెంట్ పరికి శ్రీనివాస్,దళిత సంఘం నాయకులు యల్పి ముత్యాలు,ఎంపేల్లి వీరస్వామి, మండల ఉపాద్యక్షులు కాటూరి ప్రవీణ్,మండల కార్యదర్శి కస్ప ముకుందం,గుగిల్ల సురేశ్,బిసి సంఘం ముఖ్యనాయకులు యర్రo స్వామి,కేశవ రావు, పూజారి రాజు,దాసరి ఎల్లయ్య, దాసరి నరేష్,పుల్లూరి తిరుపతి,శ్రీను,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: