గుండాల /ఆళ్లపల్లి ఏప్రిల్5 (మన్యం మనుగడ) మర్కోడు ప్రాంతంలో 2015 సంవత్సరంలో ఫారెస్ట్ అధికారుల పై దాడి చేసిన నలుగురిని ఆళ్ల పల్లి పోలీసులు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు. ఆళ్లపల్లి ఎస్సై సంతోష్ కథనం ప్రకారం 2015వ సంవత్సరంలో మర్కోడు ప్రాంతంలో న్యూ డెమోక్రసీ పార్టీ కి చెందిన తుపాకుల నాగేశ్వరరావు, రాయల సుభాష్ చంద్రబోస్, మర్కోడు కు చెందిన జనార్ధన్, రామారావు లు అటవీశాఖ అధికారులపై దారులకు పాల్పడ్డారన్నారు. ఇప్పుడు వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు ఆయన పేర్కొన్నారు
Post A Comment: