గుండాల ఏప్రిల్ 3(మన్యం మనుగడ) పురుగుల మందు తాగిన వివాహిత మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలం పరిధిలోని నరసాపురం తండా కు చెందిన బొడ సరిత (25) గత 11 రోజుల క్రితం పురుగుల మందు తాగడం తో కుటుంబ సభ్యులు వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది మృతురాలికి ఒక సంవత్సరం బాబు ఉండగా చనిపోయే సమయానికి ఆమె ఆరు నెలల గర్భిణీ గా ఉంది. గుండాల ఎస్ ఐ దారం సురేష్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం తరలించారు
Post A Comment: